News

తెలుగు రాష్ట్రాలలో కళంకిత పాలన


ఆంద్రప్రదేశ్ ,తెలంగాణలలో కళంకిత పాలన సాగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు డాక్టర్ కె. నారాయణ వ్యాఖ్యానించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుతో కళంకానికి గురి అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించి కళంకానికి గురయ్యారని ఆయన అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు రాష్ట్రాల ను సర్దుకు పొమ్మన్నారని అంటే దాని అర్దం ఓటుకు నోటు తో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం కాదని నారాయణ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు ఆయా సమస్యలలో సర్దుకుపోవాలి కాని అవినీతిలో కాదని నారాయణ అన్నారు. రెండు రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు